సైకో పాలనకు అంతం తథ్యం
ABN , First Publish Date - 2023-11-04T23:56:55+05:30 IST
అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చిన సైకో పాలనకు త్వరలోనే అంతం తథ్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు.
- ఎమ్మెల్యే బెందాళం అశోక్
ఇచ్ఛాపురం రూరల్: అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చిన సైకో పాలనకు త్వరలోనే అంతం తథ్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. వైసీపీపాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శిం చారు. శనివారం డొంకూరు, బూర్జపాడుల్లో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు భవిష్యత్తుకు గ్యారెంటీ కా ర్యక్రమం దోహ దపడుతుందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలుచేసే మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సాడి సహదేవు రెడ్డి, నాయకులు దక్కత కామేశ్వరరావు, లోపింటి పద్మ నాభం, పి.పరశురాం, దున్న లోకనాఽథం, చంద్రశేఖర్, పి.హేమరాజు, అంబటి ఈశ్వరరావు, నందికి జానీ, రెయ్యి జానీ, బి.లోహిదాసు, రామారావు, బి.గణపతి, ఎం.నారాయణ, కె.కృష్ణ, సీహెచ్ గురుమూర్తి, చీకటి సూర్యనారాయణ పాల్గొన్నారు.