టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

ABN , First Publish Date - 2023-06-26T00:04:46+05:30 IST

రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు.

టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
ప్రచారం నిర్వహిస్తున్న గుండ లక్ష్మీదేవి తదితరులు

- మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

అరసవల్లి: రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరమని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. ఆదివారం నగరంలోని 14వ డివిజన్‌లో ఇన్‌చార్జి తాళ్లూరి భాస్కర్‌(నవీన్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన బాలు, రాజా సహ కారంతో ‘భవిష్యత్తు భరోసా’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచుతూ.. ప్రజలకు మేనిఫెస్టో వివరాలను తెలియజేశారు. ఈ సం దర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో శ్రమించి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం, రాష్ట్ర తెలుకల సాధికార సమితి సభ్యుడు కొమ్మనాపల్లి వెంకటరామ రాజు, కోరాడ హరిగోపాల్‌, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణరావు, బీసీ సెల్‌ కన్వీనర్‌ బుక్కా యుగంధర్‌, రోణంకి కల్యాణ్‌, కవ్వాడ సుశీల పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:04:46+05:30 IST