ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టండి
ABN , First Publish Date - 2023-02-06T23:28:39+05:30 IST
పలాస మండలం రేగుల పాడు వద్ద ఆఫ్షోర్ నిర్మాణం చేపట్టాలని జనసేన నాయకుడు డాక్టర్ వి.దుర్గా రావు కోరారు. ఈ మేరకు సోమవారం విశాఖ పట్నంలో జలవనరుల శాఖ సీఈ సుగుణా కరరావును కలిసి వినతిపత్రం అందించారు.
కాశీబుగ్గ: పలాస మండలం రేగుల పాడు వద్ద ఆఫ్షోర్ నిర్మాణం చేపట్టాలని జనసేన నాయకుడు డాక్టర్ వి.దుర్గా రావు కోరారు. ఈ మేరకు సోమవారం విశాఖ పట్నంలో జలవనరుల శాఖ సీఈ సుగుణా కరరావును కలిసి వినతిపత్రం అందించారు. దివంగత సీఎం వైఎస్ ఆఫ్షోర్కు శంకు స్థాపన చేశారని, అయితే సీఎం జగన్ ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. 2007లో పరిపాలనా ఆమోదం వచ్చిందని, ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే నాలుగు మండలాల్లోని 108 గ్రామాలకు సాగునీటితో పాటు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి తాగునీరందే అవకాశం ఉందన్నారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సీఈ స్పందిస్తూ.. త్వరలోనే రీటెండర్లు పిలుస్తా మని చెప్పినట్లు దుర్గారావు పేర్కొన్నారు.