‘స్పందన’ సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2023-06-03T00:10:28+05:30 IST
‘స్పందన’లో వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారులు డా.మంచు కరుణాకరరావు, మెట్ట రవికృష్ణ అన్నారు. పాతపట్నం, వజ్రపుకొత్తూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం స్పందన పర్సనల్ మోనటరింగ్ యూనిట్ ఆధ్వర్యం లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
పాతపట్నం/వజ్రపుకొత్తూరు: ‘స్పందన’లో వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారులు డా.మంచు కరుణాకరరావు, మెట్ట రవికృష్ణ అన్నారు. పాతపట్నం, వజ్రపుకొత్తూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం స్పందన పర్సనల్ మోనటరింగ్ యూనిట్ ఆధ్వర్యం లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ లు కె.రవిచంద్ర, బి.అప్పలస్వామి, ఎంపీడీవోలు పేడాడ జయంత్ప్రసాద్, ఈశ్వ రమ్మ, ఈవోపీఆర్డీలు నరసింహ ప్రసాద్ పండా, తిరుమలరావు, వజ్రపుకొత్తూరు ఎస్ఐ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
తక్షణం స్పందించండి: ఎంపీడీవో
పోలాకి: పలు గ్రామాల నుంచి ప్రతి సోమవారం ‘స్పందన’కు వచ్చే వినతులను తక్షణం స్పందించి చర్యలు తీసు కోవాలని ఎంపీడీవో ఈశ్వరరావు, సూపరింటెండెంట్ ప్రకాష్ కోరారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాల యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 160 అర్జీలు స్వీకరించగా 90 శాతం పరిష్కరించామన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, సచివా లయ సిబ్బంది పాల్గొన్నారు.