ఘనంగా స్వామివారి చక్రతీర్థ స్నానం

ABN , First Publish Date - 2023-03-05T23:28:00+05:30 IST

మోదుగవలస గ్రామంలోని రామలింగేశ్వర స్వామి వారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో ఆది వారం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహా లను పల్లకిలో వేంచేపు చేసి మంగళవాయిద్యాలు, అర్చకుల వేద మం త్రాల నడుమ ఆలయం నుంచి తిరువీధిగా వంశధార నది వరకు తీసు కువెళ్లి అక్కడ పవిత్ర స్నానాలను చేయించారు.

ఘనంగా స్వామివారి చక్రతీర్థ స్నానం
స్వామిని వంశధార నదికి ఊరేగింపుగా తీసుకెళుతున్న భక్తులు

మోదుగవలస(ఎల్‌.ఎన్‌.పేట): మోదుగవలస గ్రామంలోని రామలింగేశ్వర స్వామి వారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో ఆది వారం నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహా లను పల్లకిలో వేంచేపు చేసి మంగళవాయిద్యాలు, అర్చకుల వేద మం త్రాల నడుమ ఆలయం నుంచి తిరువీధిగా వంశధార నది వరకు తీసు కువెళ్లి అక్కడ పవిత్ర స్నానాలను చేయించారు. అనంతరం మరలా విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చి అర్చకులు బలరాం పండా, కలియ పండా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహి స్తున్నట్లు గ్రామ పెద్దలు జి.జగ్గారావు, రామారావు, గణేశ్‌ కుమార్‌ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-03-05T23:28:00+05:30 IST