కంపుకొడుతోంది..!

ABN , First Publish Date - 2023-03-25T23:48:20+05:30 IST

పాతపట్నంలోని జాబిలీ రోడ్‌పై మురుగునీరు చేరి దుర్గంధంగా తయారైంది. దీంతో ఈ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

కంపుకొడుతోంది..!
జాబిలీ రోడ్‌పై చేరిన మురుగు

పాతపట్నంలోని జాబిలీ రోడ్‌పై మురుగునీరు చేరి దుర్గంధంగా తయారైంది. దీంతో ఈ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. స్థానిక సామాజిక ఆసుపత్రి మొదలుకొని కాపువీధి వర కూ గల కొత్తదేవాంగువీధి, పెద్దదేవాంగులవీధి, ఉప్పరవీధి, తెలుకలవీధి, పిల్లవీధి, రెల్లివీధి, కోటగుడ్డి కాలనీలతోపాటు వివిధ వీధివాసులు ప్రధాన రహదారికి చేరేందుకు ఈ రోడ్‌నే వినియోగిస్తారు. రోడ్డంతా మురుగునీరు చేరుతుం డడంతో ఈ మార్గం గుండా వెళ్లాంటే పాదచారులు హడలెత్తుతున్నారు. ప్రధానంగా ఆయావీధి మహిళలు వేంకటేశ్వర, నీలమణి దుర్గ ఆలయాలకు ఈ రోడ్‌ గుండానే వెళ్తుంటారు. ఇలా ఎంతో ప్రాధాన్యం గల ఈ రోడ్డు దుర్గం ధంగా మారిన పం చాయతీ పాలకులపై స్థానికులు మండిప డుతున్నారు. కాలువ లోని పూడికలు తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్థానికు లు చెబుతున్నారు. మే నెలలో జరగనున్న పెద్దపండగలు నేపథ్యంలో ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-25T23:48:33+05:30 IST