సొండి కులస్థులను ఓబీసీల్లో చేర్చాలి

ABN , First Publish Date - 2023-04-03T00:16:08+05:30 IST

అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న సొండి కులస్థులను ఓబీసీల్లో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రత్నాల కాశీ విశ్వనాథ్‌ చౌదరి అన్నారు. ఆదివారం స్థానికంగా సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొండి కుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

సొండి కులస్థులను ఓబీసీల్లో చేర్చాలి
మాట్లాడుతున్న సొండి కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌ చౌదరి

టెక్కలి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న సొండి కులస్థులను ఓబీసీల్లో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రత్నాల కాశీ విశ్వనాథ్‌ చౌదరి అన్నారు. ఆదివారం స్థానికంగా సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొండి కుల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో అమలు చేస్తున్న విధంగా సారా వేలంపాటల్లో సొండి కులస్థులకు ప్రత్యేక రాయితీలు కల్పించాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెహరా రాజారావు, ఉపాధ్యక్షుడు యు.గణపతిరావు, టెక్కలి శాఖ అధ్యక్షుడు సాహుకారి యల్లా రావు, కార్యదర్శి నాగభూషణం, ఆర్వీ ప్రసాద్‌, రత్నాల శ్రీను, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:16:08+05:30 IST