అలసత్వం వల్లే నత్తనడకన పనులు
ABN , First Publish Date - 2023-11-10T00:01:11+05:30 IST
స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం వల్లే ఆఫ్షోర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని జనసేన నాయకుడు దుర్గారావు ఆరోపించారు. గురు వారం ఆఫ్షోర్కుడికాలువ హెడ్రెగ్యులేటర్ పనులను జనసేన నాయకులు పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పొలాలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో కుడికాలువ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారని, గత మే,జూన్లో జరిగిన మట్టి పనులకు ఇంతవరకూ బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు ప్రధాన రిజర్వాయరు పనులను ఆపివేశారని ఆరోపించారు. ఇప్పటి వరకూ ఎడమ కాలువ కోసం భూసేకరణ, డిజైన్ రూపొందించ లేదని విమర్శించారు. వంశ ధార ఎడమ కాలువకు నీరందించకపోవడం, ఆఫ్షోర్పనులు నత్తనడకన సాగడం దారుణమని, రైతులకు ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపించారు.
పలాస రూరల్: స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం వల్లే ఆఫ్షోర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని జనసేన నాయకుడు దుర్గారావు ఆరోపించారు. గురు వారం ఆఫ్షోర్కుడికాలువ హెడ్రెగ్యులేటర్ పనులను జనసేన నాయకులు పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పొలాలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో కుడికాలువ తవ్వకాలను రైతులు అడ్డుకున్నారని, గత మే,జూన్లో జరిగిన మట్టి పనులకు ఇంతవరకూ బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు ప్రధాన రిజర్వాయరు పనులను ఆపివేశారని ఆరోపించారు. ఇప్పటి వరకూ ఎడమ కాలువ కోసం భూసేకరణ, డిజైన్ రూపొందించ లేదని విమర్శించారు. వంశ ధార ఎడమ కాలువకు నీరందించకపోవడం, ఆఫ్షోర్పనులు నత్తనడకన సాగడం దారుణమని, రైతులకు ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపించారు.