శాస్త్రోక్తంగా సిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2023-06-07T23:36:37+05:30 IST
నందిగాం గణేష్ కాలనీలో నూతనంగా నిర్మించిన సిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ మహో త్సవం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వ హించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గణపతి నామస్మరణ మధ్య ఘనంగా చేప ట్టారు.
నందిగాం: నందిగాం గణేష్ కాలనీలో నూతనంగా నిర్మించిన సిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ మహో త్సవం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వ హించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గణపతి నామస్మరణ మధ్య ఘనంగా చేప ట్టారు. ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, కాలనీ వాసుల ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు రేజేటి బోసు బాబు, సహాయకుడు మేడేపల్లి రమేష్శర్మ పర్యవేక్షణలో విశేష పూజలు చేసి హోమాలు, యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో పలువురు స్థానికులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.