సమస్యలు పరిష్కరించాలంటూ రిలే దీక్ష
ABN , First Publish Date - 2023-05-31T23:55:03+05:30 IST
సమస్యలు పరిష్కరించా లని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధ వారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి మాట్లాడు తూ.. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వా న్ని అనేకమార్లు కోరినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు.
టెక్కలి, మే 31: సమస్యలు పరిష్కరించా లని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధ వారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి మాట్లాడు తూ.. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వా న్ని అనేకమార్లు కోరినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి విసుగు చెంది శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడు తున్నామన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, న్యాయం కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, ఎల్పీజీఎల్ఐలకు రక్షణ కల్పిం చాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేయా లన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శంకరరావు, సూర్యనారా యణ, వెంకటరమణ, సుశీల, విజయ్ కుమార్, జనార్దన, లలిత, రమణ బాబు, పలు శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.