రూ.65 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2023-06-26T00:19:00+05:30 IST

జిల్లాలో రూ.65 కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన జారీ చేశారు. టెక్కలి, పాతపట్నం రైల్వే స్టేషన్లలో రూ.1.30 కోట్లతో ప్లాట్‌ఫారాలు నిర్మించినట్లు చెప్పారు.

రూ.65 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు

శ్రీకాకుళం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ.65 కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన జారీ చేశారు. టెక్కలి, పాతపట్నం రైల్వే స్టేషన్లలో రూ.1.30 కోట్లతో ప్లాట్‌ఫారాలు నిర్మించినట్లు చెప్పారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి, వల్లభరాయిపాడు, బ్రాహ్మణతర్లా తదితర రైల్వే అండర్‌పాస్‌లకు రూ.1.80 కోట్లతో రూఫ్‌ టాప్‌ల నిర్మాణం జరిగిందన్నారు. పూండి రైల్వే స్టేషన్‌లో రూ.2కోట్లతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, దూసి, తిలారు, కోటబొమ్మాళి, పూండి రైల్వే స్టేషన్లలో రూ. 2కోట్ల వ్యవయంతో కొత్త భవనాల నిర్మాణం జరుగుతోందని వివరించారు. రూ.60 కోట్లతో 18 వివిధ చోట్ల రైల్వే అండర్‌పాస్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ద్వారా ప్రజలను మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. అన్ని రైల్వే స్టేషన్లను శాశ్వత అభివృద్ధికి కృషి చేస్తానని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

Updated Date - 2023-06-26T00:19:00+05:30 IST