ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం
ABN , First Publish Date - 2023-03-05T23:31:33+05:30 IST
ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగ నున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. నరసన్నపేట పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు.
నరసన్నపేట: ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగ నున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. నరసన్నపేట పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,200 వేల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. సచివా లయ ఉద్యోగుల మాత్రమే ఇంటికి వెళ్లి స్లిప్పులను అందించా లని ఏఆర్వో సింహాచలం సూచించారు. కార్యక్రమంలో డీటీ హేమసుందర్, శ్రీనివాసరావు, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.