ముఖలింగేశ్వరుని సన్నిధిలో పండిత సదస్యం
ABN , First Publish Date - 2023-06-03T00:08:11+05:30 IST
సుప్రసిద్ధ శైవక్షేత్ర శ్రీముఖలింగేశ్వరాలయంలో శుక్రవారం పండిత సదస్యం నిర్వహించారు. వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి సన్నిధిలో అర్చకులు, గ్రామ పురోహితులు ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేసి పండిత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్వామి వారి విశిష్టత, చరిత్రపై ప్రవచించారు.
జలుమూరు: సుప్రసిద్ధ శైవక్షేత్ర శ్రీముఖలింగేశ్వరాలయంలో శుక్రవారం పండిత సదస్యం నిర్వహించారు. వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామివారి సన్నిధిలో అర్చకులు, గ్రామ పురోహితులు ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేసి పండిత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్వామి వారి విశిష్టత, చరిత్రపై ప్రవచించారు. అనంతరం చతుర్వేద పారాయణ, పండిత సత్కారం, హారతి, మహామంత్రపుష్పం తదితర కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పురోహితుడు బంకుపల్లి భూషణ శర్మ, అర్చకులు నారాయణమూర్తి, సింహాచలం, శ్రీకృష్ణ, శివ, అచ్యుత, యోగి తదితరులు పాల్గొన్నారు.