లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
ABN , First Publish Date - 2023-03-18T00:52:17+05:30 IST
కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ను శుక్రవారం సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి, ముని సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, మాజీ ఎంపీ కణితి విశ్వ నాఽథంతో కలిసి ప్రారంభించారు. అనసూయ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వేలాదిమంది యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పలాసకు తొలిసారి తాను వచ్చానని, ఈ ప్రాంతం ఎంతో హాయిగా అనిపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు తన రాకకోసం వేచి వేచి ఉండడం ఆనందంగా ఉందని ధన్య వాదాలు తెలిపారు.
లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
ఫ జ్యోతి ప్రజ్వలన చేసిన సినీనటి అనసూయ
కాశీబుగ్గ, మార్చి 17: కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ను శుక్రవారం సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి, ముని సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, మాజీ ఎంపీ కణితి విశ్వ నాఽథంతో కలిసి ప్రారంభించారు. అనసూయ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వేలాదిమంది యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పలాసకు తొలిసారి తాను వచ్చానని, ఈ ప్రాంతం ఎంతో హాయిగా అనిపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు తన రాకకోసం వేచి వేచి ఉండడం ఆనందంగా ఉందని ధన్య వాదాలు తెలిపారు. పని ముఖ్యమని, యాంకర్ లేదా సినిమా లతో పాటు షాపింగ్ మాల్స్ ప్రారంభించేందుకు వెళుతున్నా నన్నారు. ఇందులో భాగంగానే పలాసలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు వచ్చానన్నారు. ప్రేక్షకులు తనను ఆదరి స్తున్నారని, మంచి అవకాశాలు వస్తే మంచి పాత్రలు పోషిస్తా నన్నారు. టీవీలో కనిపించడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు అవకాశం, సమయం వచ్చినప్పుడు మరలా టీవీలో యాంకర్గా పని చేస్తానని సమాధానం ఇచ్చారు. లక్కీ షాపింగ్మాల్ను ప్రారంభించేందుకు వచ్చిన అనసూయ.. మాల్ ఎదుట ప్రజలకు అభివాదం చేసి ‘హలో పలాస’ అం టూ సినీ పాటలకు నృత్యం చేసి యువకులు, మహిళలను ఉత్సాహ పరిచారు. తనకు ఎప్పటి నుంచో పలాస రావా లని కోరిక ఉండేదని నేటితో నెరవేరిందన్నారు. లక్కీ షాపింగ్ మాల్లో సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి ప్రజల వరకు అందుబాటులో ఉండే వస్త్రాలు లభ్యమవుతాయని, ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు.
ఫ్యాషన్ ప్రపంచంలో మరో అడుగు
గతంలో ఎన్నడూ లేనివిధంగా మారుతున్న కాలంతో పాటు పలాస పట్టణాన్ని ఫ్యాషన్ ప్రపంచంలో మరో అడుగు ముందుకు వేయించే మెగా ప్రయత్నమే మా లక్కీ షాపింగ్ మాల్ ఉద్దేశమని అధినేతలు శ్రీనివాస్, రత్తయ్య, స్వామి అన్నారు. లక్కీ షాపింగ్ మాల్ అంటే సౌందర్యానికి సోపానమని, అందరికీ అందుబాటులో ధరలు, నాణ్యమైన వస్త్రాల కు ప్రసిద్ధి అని అన్నారు. మా షాపింగ్ మాల్ దశాబ్ద కాలం గా విశాఖపట్నం వస్త్ర వ్యాపారంలో ఒక ఫ్యాషన్ మాల్గా ప్రత్యేకమైన గుర్తింపు పొందిందన్నారు. అనకాపల్లి, విజయ వాడ, పెద్దా పురంలలో విజయకేతనం ఎగురవేసి 8వ ప్రపంచ స్థాయి షాపింగ్ మాల్ పలాసలో ప్రారంభించామన్నారు. అన్ని రకాలు వస్త్రాలు లభ్యమవుతాయని, ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలాస ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్, వైస్ చైర్మన్లు బి.కృష్ణారావు, సురేష్, ప్రము ఖ వ్యాపారవేత్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.