Share News

టెక్కలిలో ఒకరి ఆత్మహత్య

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:31 PM

టెక్కలిలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన హేమసుందర్‌ ఐదమ్‌(55) గురువారం తన ఇంట్లో బాత్‌ రూమ్‌లో ఉన్న యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకథనం మేరకు.. ప్రైవేట్‌సెక్యూరిటీ గార్డుగా హేమ సుందర్‌ పనిచేసేవాడు. కొద్దిరోజులుగా ఖాళీగా ఇంట్లోనే ఉంటున్న ఆయన మద్యానికి బానిసై భార్యతో తగాదాలు పడుతున్నాడు. ఈక్రమంలో బుధవారం మద్యం తాగి భార్యతో గొడవపడగా భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. ఈనేపథ్యంలో గురువారం హేమసుందర్‌ యాసిడ్‌ తాగ డంతో స్థానికులు చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎల్‌ రామకృష్ణ తెలిపారు. ఐదమ్‌కు భార్య ధనలక్ష్మి, కుమారుడు, కుమర్తె ఉన్నారు.

 టెక్కలిలో ఒకరి ఆత్మహత్య

టెక్కలి రూరల్‌: టెక్కలిలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన హేమసుందర్‌ ఐదమ్‌(55) గురువారం తన ఇంట్లో బాత్‌ రూమ్‌లో ఉన్న యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకథనం మేరకు.. ప్రైవేట్‌సెక్యూరిటీ గార్డుగా హేమ సుందర్‌ పనిచేసేవాడు. కొద్దిరోజులుగా ఖాళీగా ఇంట్లోనే ఉంటున్న ఆయన మద్యానికి బానిసై భార్యతో తగాదాలు పడుతున్నాడు. ఈక్రమంలో బుధవారం మద్యం తాగి భార్యతో గొడవపడగా భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. ఈనేపథ్యంలో గురువారం హేమసుందర్‌ యాసిడ్‌ తాగ డంతో స్థానికులు చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎల్‌ రామకృష్ణ తెలిపారు. ఐదమ్‌కు భార్య ధనలక్ష్మి, కుమారుడు, కుమర్తె ఉన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:31 PM