వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-06-03T00:25:29+05:30 IST
స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్న కోల భాను(32) అనే వివా హిత శుక్రవారం ఉరి పోసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది.
పలాస: స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్న కోల భాను(32) అనే వివా హిత శుక్రవారం ఉరి పోసుకొని ఆత్మ హత్యకు పాల్పడింది. ఈమె భర్త కోల రాము స్థానికంగా పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి వివాహమై ఏడేళ్లవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె మనస్తాపానికి గురై ఇంటిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిప ారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.