సపర్యలు చేసి.. గర్భిణిని కాపాడి..
ABN , First Publish Date - 2023-11-22T23:42:11+05:30 IST
www
పలాస రూరల్: మండలంలోని బ్రాహ్మణతర్లా సచివాలయానికి చెందిన ట్రైనీ స్టాఫ్నర్స్ వనజాక్షి ఓ నిండుగర్భిణికి సపర్యలు చేసి కాపాడింది. మంగళవారం రాత్రి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ గర్భిణికి తీవ్రమైన నొప్పులు రావడంతో బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చేలా సపర్యలు చేయడంతో ప్రయాణికులు అభినందించారు.ప్రయాణికుల కథనంమేరకు.. విశాఖ నుం చి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒడిశాలోని సుర్ల గ్రామానికి చెం దిన గర్భిణి జమునరెడ్డి వెళ్తోంది. మార్గమధ్యలో ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో బస్సులో ప్రయాణిస్తున్న బ్రాహ్మణతర్లా సచివాలయా నికి చెందిన స్టాఫ్నర్స్ వనజాక్షి పరిస్థితిని గమనించింది. ఆమె బస్సులోనే ప్రసవమయ్యేలా చేసి 108 వాహనానికి సమాచారం అందించారు. తర్వా త పలాస ప్రభుత్వాసుపత్రికి చేర్పించి ఆసుపత్రిలో ఉండి ఆమె సపర్యలు చేశారు.ప్రసవానికి ఇబ్బందులు లేకుండా సహకరించిన వనజాక్షిని ప్రయా ణీకులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు.