Share News

న్యాయం గెలిచింది

ABN , First Publish Date - 2023-11-20T23:54:38+05:30 IST

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

న్యాయం గెలిచింది
శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు

- చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరుపై టీడీపీ శ్రేణుల హర్షం

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి బృందం)

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు కావడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ‘న్యాయం గెలిచింది. జయహో చంద్రన్నా’.. అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. సోమవారం శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి సందడి చేశారు. కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. చంద్రబాబు నీతినిజాయితీకి ఈ తీర్పు నిలువుటద్దమని స్పష్టం చేశారు. టెక్కలి, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లోనూ ఘనంగా సంబరాలు నిర్వహించారు.

Updated Date - 2023-11-20T23:54:40+05:30 IST