గణపయ్యకు నిమజ్జనం
ABN , First Publish Date - 2023-09-25T23:57:21+05:30 IST
వినాయక ఉత్సవాల సందర్భంగా హిరమం డలంలో ఏర్పాటు చేసిన పలు గణేశ్ విగ్రహాలను సోమవారం ప్రత్యేక వాహనాలపై ఉంచి ఊరే గించి వంశధార నదిలో నిమజ ్జనం చేశారు. లంబోదరుడి ఊరే గింపులో యువతీ, యువకులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.

హిరమండలం: వినాయక ఉత్సవాల సందర్భంగా హిరమం డలంలో ఏర్పాటు చేసిన పలు గణేశ్ విగ్రహాలను సోమవారం ప్రత్యేక వాహనాలపై ఉంచి ఊరే గించి వంశధార నదిలో నిమజ ్జనం చేశారు. లంబోదరుడి ఊరే గింపులో యువతీ, యువకులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. సుభలయ ఆర్ఆర్ కాలనీ, మైత్రీ కాలనీల్లో ఏడురోజలుపాట ప్రత్యేక పూజలు చేసి సోమవారం వంశఽ దార నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లంక రోజా, జడ్పీటీసీ బుచ్చిబాబు, ఎంపీటీసీ చింతాడ బుడ్డు తదితరులు పాల్గొన్నారు.
60 వంటకాలతో నైవేద్యం
నరసన్నపేట: జోగిపేటలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో సోమవారం స్వామి మహిళలు 60 వంటకాలను తయారుచేసి సమర్పించారు. మహిళంతా ఒకే రకమైన వస్త్రాలంకరణ చేసి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొత్తవీధి, నాయుడు వీధి వినాయకుడ్ని తహసీల్దార్ సింహాచలం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.
ఘనంగా గణపతి సహస్ర అర్చన
నందిగాం: నందిగాం కారిగుడ్డి వీధిలో కొలువైన వినాయక మండపంలో సోమవారం సామూహిక గణపతి సహస్ర నామార్చన చేశారు. ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో పురోహితులు మేడేపల్లి రమేష్శర్మ పర్య వేక్షణలో విశేష పూజలు, హోమం నిర్వమించారు. మహిళలు గణపతి సహస్రనామ పారాయణ చేశారు. దిగువ బీసీ కాలనీ, శివరాంపురం తదితర వీధుల్లోని వినాయక మండపాల వద్ద అన్నప్రసాద వితరణ చేపట్టారు.