సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
ABN , First Publish Date - 2023-06-03T00:14:42+05:30 IST
సమస్యలు పరిష్కరించ కుంటే ఉద్య మం ఉధృతం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిం చాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతల హెచ్చరిక
పలాసరూరల్, జూన్ 2: సమస్యలు పరిష్కరించ కుంటే ఉద్య మం ఉధృతం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిం చాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ డైలీవేజ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయా లని, 11వ పీఆర్సీ అమలు, డీఏ, ఎరియర్స్ విడుదల చేయా లని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము (జీపీఎఫ్, ఎపీజీ ఎల్ఐ) కి భద్రత కల్పించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. తమ డిమాండ్లను తీర్చకుంటే నవంబరు ఒకటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సంఘ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఉద్యోగుల సంఘం పలా స-కాశీబుగ్గ అధ్యక్షుడు నల్లాన లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజేశ్వరి, సభ్యులు పి.రామారావు, ఎస్.రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.