కబడ్డీలో హరిపురం విద్యార్థి ప్రతిభ
ABN , First Publish Date - 2023-03-25T23:36:43+05:30 IST
మందస మండలం హరిపురం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కరగాన చరణ్ రాష్ట్ర స్థాయి కబడ్డీలో ప్రతిభ కనబరిచినట్టు హెచ్ఎం ఎన్.తారకేశ్వరరావు తెలిపారు.
హరిపురం: మందస మండలం హరిపురం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కరగాన చరణ్ రాష్ట్ర స్థాయి కబడ్డీలో ప్రతిభ కనబరిచినట్టు హెచ్ఎం ఎన్.తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థిని అభినందించారు. చిత్తూరు జిల్లాలో గత నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున చరణ్ పాల్గొన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ ఎస్.రామారావు, సర్పంచ్ జె.పురుషోత్తం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.