ధాన్యం కొనుగోలుచేయాలి

ABN , First Publish Date - 2023-01-17T22:58:19+05:30 IST

ఇచ్ఛాపురం మండలం, మునిసిపాలిటీ పరిధి లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కౌన్సిల ర్లు, సర్పంచ్‌లు కోరారు.ఈ మేరకు మంగళవారం ఇచ్ఛాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ ఎం.జయంతిని కలిసి రైతుల సమస్యలను వివరించారు.

ధాన్యం కొనుగోలుచేయాలి

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మండలం, మునిసిపాలిటీ పరిధి లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కౌన్సిల ర్లు, సర్పంచ్‌లు కోరారు.ఈ మేరకు మంగళవారం ఇచ్ఛాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ ఎం.జయంతిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. దీంతో స్పందించిన డీఎం మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఏవో శ్రీదేవి, సర్పంచ్‌ రాజశేఖర రెడ్డి, కౌన్సిలర్‌ నీలాపు ఢిల్లీ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T22:58:20+05:30 IST