వైభవంగా ఆదిత్యుని కల్యాణం
ABN , First Publish Date - 2023-02-01T23:52:25+05:30 IST
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్య నారాయణ స్వా మివారి కల్యాణో త్సవం బుధవా రం వైభవంగా నిర్వహించారు.
అరసవల్లి: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్య నారాయణ స్వా మివారి కల్యాణో త్సవం బుధవా రం వైభవంగా నిర్వహించారు. మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆలయ అనివెట్టి మండపంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి క ల్యాణం వైభవంగా నిర్వహించినట్టు ఈవో హరిసూర్యప్రకాష్ తెలియజే శారు. అలాగే శ్రీకాకుళం నగరానికి చెందిన పీఎస్వీఎస్ గోపీనాథ్, రమ్య దంపతులు సూర్యనారాయణ స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి శాశ్వత అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్కు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ బీఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.