‘ఎలుగు’ బాధితులకు చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2023-03-30T23:37:46+05:30 IST
ఎలుగుబంటి దాడిలో గాయపడిన వజ్రపుకొత్తూరుకు చెందిన యువకులకు వైద్య ఖర్చుల నిమిత్తం అటవీశాఖ అధికారులు చెక్కులను గురువారం పంపిణీ చేశారు.
వజ్రపుకొత్తూరు: ఎలుగుబంటి దాడిలో గాయపడిన వజ్రపుకొత్తూరుకు చెందిన యువకులకు వైద్య ఖర్చుల నిమిత్తం అటవీశాఖ అధికారులు చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఎలుగుదాడిలో తీవ్ర గాయాలైన వారికి శ్రీకా కుళం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించారు. దీనికి సంబందించి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి చొరవతో నిధులు మంజూరైనట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నాయు డు తెలిపారు. గాయాలైన కలిశెట్టి అప్పలస్వామికి రూ.2,85,665, ఉప్పరపల్లి సంతోష్కు రూ..2,43,208, పోతనపల్లి తులసీరావుకు రూ.1,15,578 చెక్కులను రేంజర్ నాయుడు అందించారు. గతంలో వీరికి రూ.75 వేల వంతున అందించారు.