భావనపాడు పోర్టుతో జిల్లా అభివృద్ధి
ABN , First Publish Date - 2023-04-16T00:05:39+05:30 IST
భావనపాడు పోర్టు నిర్మాణంతో జిల్లా అభివృద్ధి చెంద నుందని మంత్రి ధర్మాన ప్రసాదరా వు పేర్కొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భావనపాడు పోర్టు శంకుస్థాపనకు, గొట్టా బ్యారేజి ఎత్తిపోతల పథకం ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న జిల్లాకు రానున్నట్లు తెలిపా రు.
అరసవల్లి: భావనపాడు పోర్టు నిర్మాణంతో జిల్లా అభివృద్ధి చెంద నుందని మంత్రి ధర్మాన ప్రసాదరా వు పేర్కొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భావనపాడు పోర్టు శంకుస్థాపనకు, గొట్టా బ్యారేజి ఎత్తిపోతల పథకం ప్రారం భోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న జిల్లాకు రానున్నట్లు తెలిపా రు. ఈ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొర్లె కిరణ్కుమార్, ఎమ్మెల్సీ దువ్వా డ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంత్రి ప్రసాదరావు, కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, ఎస్పీ రాధికతో కలిసి అధికారులతో స మావేశం నిర్వహించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.