4న శ్రీముఖలింగేశ్వరాలయ హుండీల లెక్కింపు
ABN , First Publish Date - 2023-10-30T23:49:18+05:30 IST
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీలను నవంబరు 4న ఉదయం 10 గంటలకు తెరిచి లెక్కించనున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు ఒక ప్రకట నలో తెలిపారు.
జలుమూరు: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీలను నవంబరు 4న ఉదయం 10 గంటలకు తెరిచి లెక్కించనున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు ఒక ప్రకట నలో తెలిపారు. దేవదాయశాఖ అధికారులు పర్యవేక్షణలో పాలకమండలి సభ్యులు, ధర్మకర్తలు, అర్చకులు లెక్కిస్తారన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు, గ్రామపెద్దలు పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.