ఎలుగు సంచారంతో ఆందోళన
ABN , First Publish Date - 2023-02-06T23:31:51+05:30 IST
లోహరిబంద పంచాయతీ కొత్తపేట గ్రామంలో సోమవారం పట్టపగలే ఎలుగుబంటి సంచరించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓఇంటి పెరటిలోకి ప్రవేశించడంతో గ్రామస్థులు గట్టిగా కేకలు వేసి తరిమివేయడంతో జీడి తోటలోకి వెళ్లిపోయింది.
హరిపురం: లోహరిబంద పంచాయతీ కొత్తపేట గ్రామంలో సోమవారం పట్టపగలే ఎలుగుబంటి సంచరించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓఇంటి పెరటిలోకి ప్రవేశించడంతో గ్రామస్థులు గట్టిగా కేకలు వేసి తరిమివేయడంతో జీడి తోటలోకి వెళ్లిపోయింది. గత ఏడాది ఇదే ప్రాంతంలో సుమారు ఆరుగురు ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలైన సంఘటన తెలిసిందే. మర లా ఎలుగు గ్రామంలోకి ప్రవేశించడంతో స్థానికులు భయాం దోళన చెందుతున్నారు. గ్రామస్థులు కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయగా బీట్ అధికారి సంతోష్కుమార్ గ్రామాన్ని సందర్శించి ప్రజలకు సూచనలిచ్చారు.