చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2023-12-12T23:36:32+05:30 IST
చిరుధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కల్నల్ ప్రసూన్ కుమార్ పండా అన్నారు.
అరసవల్లి: చిరుధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కల్నల్ ప్రసూన్ కుమార్ పండా అన్నారు. మంగళవారం మునసబుపేట గాయత్రీ కళాశాలలో శ్రీశ్రీ అగ్రికల్చరల్ కళాశాల, భాస్కర ప్రకృతి వ్యవసాయ రైతుల సేవాసంస్థ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులు ఏర్పాటు చేసిన తృణధాన్యాల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్నల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే చిరుధాన్యాల ఆహారపు అలవాట్లను నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు దార్లపూడి రవి, గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు, కరస్పాండెంట్ అంబటి రంగారావు, కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, ఎన్సీసీ అధికారులు కెప్టెన్ వంగా మహేష్, వల్ల రేవతి, సుబేదార్, మేజర్ తదితరులు పాల్గొన్నారు.