వివక్షపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-06-03T00:22:54+05:30 IST

పాతనౌపడ గ్రామానికి చెందిన అగ్ర కులస్థులు తమపై వివక్ష చూపుతున్నారని శుక్రవారం రాత్రి పాతనౌపడ ఎస్సీ కాలనీకి చెందిన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివక్షపై పోలీసులకు ఫిర్యాదు

టెక్కలి రూరల్‌: పాతనౌపడ గ్రామానికి చెందిన అగ్ర కులస్థులు తమపై వివక్ష చూపుతున్నారని శుక్రవారం రాత్రి పాతనౌపడ ఎస్సీ కాలనీకి చెందిన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఎస్సీలకు చెందిన వివాహాలు, శుభకార్యాల సమయంలో గ్రామంలోని దేవాలయాల్లోకి వెళ్లనీయకుండా అగ్రకులా లకు చెందిన పలువురు ఇబ్బందులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామంలోని శివాలయంలో జరిగిన స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనకుండా కొందరు ఆంక్షలు విఽధించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై 100కి కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ మాట్లాడు తూ.. గ్రామానికి చెందిన దళితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-06-03T00:22:54+05:30 IST