ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మల దహనం

ABN , First Publish Date - 2023-04-03T00:14:52+05:30 IST

బోయ, వాల్మీకి, బెంతొరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినందుకు వ్యతిరేకంగా పురుషోత్తకర్ర గిరిజన గ్రామంలో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మలను ఊరేగించి శనివారం రాత్రి దహనం చేసి నిరసన తెలిపారు.

ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మల దహనం
ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మలను ఊరేగిస్తున్న గిరిజనులు

సారవకోట (జలుమూరు), ఏప్రిల్‌ 2: బోయ, వాల్మీకి, బెంతొరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినందుకు వ్యతిరేకంగా పురుషోత్తకర్ర గిరిజన గ్రామంలో రాష్ట్రంలోని ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీ దిష్టిబొమ్మలను ఊరేగించి శనివారం రాత్రి దహనం చేసి నిరసన తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి మాట్లాడుతూ.. గిరిజనులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి మద్దతిస్తున్న ఏడుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు చింతపల్లి భాస్కరరావు, కొంకాడ మన్మథరావు, విజయకుమార్‌, జన్ని సుదర్శన్‌, జన్ని నీలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:14:52+05:30 IST