అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు, కేసులు

ABN , First Publish Date - 2023-04-03T23:45:19+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజలను హింసిస్తోందని, ప్రశ్నిస్తే కేసులతో పాటు గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ పలాస మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడి దారణమని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న లక్ష్మణ్‌కుమార్‌ని సోమవారం ఆయన పరామర్శించారు.

 అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు, కేసులు
ప్రైవేట్‌ ఆసుపత్రిలో లక్ష్మణ్‌కుమార్‌ను పరామర్శిస్తున్న అచ్చెన్నాయుడు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కాశీబుగ్గ, ఏప్రిల్‌ 3: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజలను హింసిస్తోందని, ప్రశ్నిస్తే కేసులతో పాటు గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ పలాస మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడి దారణమని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాశీబుగ్గ ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న లక్ష్మణ్‌కుమార్‌ని సోమవారం ఆయన పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌పై దాడి అమానుషమన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారా యణ మూర్తి (బాబ్జి), నాయకులు లొడగల కామేశ్వరరావు, నాగరాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:45:19+05:30 IST