4.54 లక్షల మంది మహిళలకు ‘ఆసరా’

ABN , First Publish Date - 2023-03-25T23:59:08+05:30 IST

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మూడో విడత కింద జిల్లాలో 4.54 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వీరి ఖాతాల్లో రూ.310.21కోట్లు జమయ్యాయి. ఈ మేరకు శనివారం నగరంలో ని బాపూజీ కళామందిర్‌లో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా మహిళలకు న మూనా చెక్కులను పంపిణీ చేశారు.

4.54 లక్షల మంది మహిళలకు ‘ఆసరా’

శ్రీకాకుళం (ఆంధ్రజ్యో తి): వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం మూడో విడత కింద జిల్లాలో 4.54 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వీరి ఖాతాల్లో రూ.310.21కోట్లు జమయ్యాయి. ఈ మేరకు శనివారం నగరంలో ని బాపూజీ కళామందిర్‌లో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా మహిళలకు న మూనా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్య మిస్తోందని తెలిపారు. అంతర్జా తీయ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో చిరుధాన్యాల ప్రదర్శన కార్యక్ర మాన్ని మంత్రి ధర్మాన ప్రారం భించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, రాష్ట్ర కళింగ వైశ్య, తూర్పుకాపు చైర్మన్‌లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌, రాష్ట్ర మహిళా ఆర్థికసంస్థ చైర్‌పర్సన్‌ హేమమాలినిరెడ్డి, డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:59:08+05:30 IST