తపాలశాఖ ఔట్లెట్స్కు దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-03-31T00:04:34+05:30 IST
కాశీబుగ్గ, సోంపేట పట్టణాల్లో భారత తపాల శాఖ సేవలు అందించేందుకు ప్రాంచైజీ ఔట్లెట్స్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ వి.సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: కాశీబుగ్గ, సోంపేట పట్టణాల్లో భారత తపాల శాఖ సేవలు అందించేందుకు ప్రాంచైజీ ఔట్లెట్స్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్టు శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ వి.సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తపాల స్టాంపులు, కవర్లతోపాటు రిజిస్టర్ లెటర్లు, పార్శిల్స్, మనియార్డర్లు, స్పీడ్ పోస్టు బుక్ చేయడం తదితర తపాలా సేవలు ఈ ఔట్లెట్స్ ద్వారా అందించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీలోగా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ ఆఫీస్, శ్రీకాకుళం చిరునామాకు దరఖాస్తులు పంపించాలన్నారు. ఇందుకు సంబంధించి ఆప్లికేషన్ల కోసం కాశీబుగ్గ, సోంపేట కేంద్రాల్లో, శ్రీకాకుళం సూపరింటెండెంట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 18 ఏళ్లు నిండిన వారు అర్హలన్నారు. పోస్టల్ పెన్షనర్లకు, కంప్యూటర్ సౌకర్యం అందించగల వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎంపికైన వారు రూ.5వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు.