Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:12 PM

శాంతి భద్ర తలకు విఘాతం కలి గించే వారిపై చట్టపర మైన చర్యలు తీసుకుం టామని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరి కృష్ణ హెచ్చరించారు. ఆదివారం కాశీబుగ్గ సర్కిల్‌ పోలీసు స్టేషన్‌, డీఎస్పీ కార్యాలయాల్లో వార్షిక తనిఖీలు నిర్వహిం చారు. మధ్యాహ్నం పోలీ స్‌స్టేషన్‌లో వివిధ కేసు లకు సంబంధించి ఫైళ్లు పరిశీలించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో డివిజన్‌లోని పోలీస్‌స్టేషన్ల వారీగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలు అడిగి పరిష్కరించాలని కోరారు. తొలుత పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న డీఐజీకి పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఫిర్యాదుల విభాగంలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐలు నవీన్‌కుమార్‌, శంకరరావు, మల్లేశ్వరరావుతోపాటు సబ్‌డివిజన్‌కు చెందిన ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

 శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
పోలీస్‌స్టేషన్‌లోని ఫిర్యాదుల విభాగంలో రికార్డును పరిశీలిస్తున్న డీఐజీ హరికృష్ణ :

పలాస: శాంతి భద్ర తలకు విఘాతం కలి గించే వారిపై చట్టపర మైన చర్యలు తీసుకుం టామని విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరి కృష్ణ హెచ్చరించారు. ఆదివారం కాశీబుగ్గ సర్కిల్‌ పోలీసు స్టేషన్‌, డీఎస్పీ కార్యాలయాల్లో వార్షిక తనిఖీలు నిర్వహిం చారు. మధ్యాహ్నం పోలీ స్‌స్టేషన్‌లో వివిధ కేసు లకు సంబంధించి ఫైళ్లు పరిశీలించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో డివిజన్‌లోని పోలీస్‌స్టేషన్ల వారీగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలు అడిగి పరిష్కరించాలని కోరారు. తొలుత పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న డీఐజీకి పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఫిర్యాదుల విభాగంలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐలు నవీన్‌కుమార్‌, శంకరరావు, మల్లేశ్వరరావుతోపాటు సబ్‌డివిజన్‌కు చెందిన ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - Dec 24 , 2023 | 11:12 PM