దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం

ABN , First Publish Date - 2023-03-26T00:01:22+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేసి విపక్ష పార్టీలను అణగ దొక్కేందుకు యత్నిస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు. శనివారం మండలంలోని మునగవలసలో పర్యటించారు.

దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం
మునగవలసలో ర్యాలీ నిర్వహిస్తున్న సత్యవతి

ఆమదాలవలస: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేసి విపక్ష పార్టీలను అణగ దొక్కేందుకు యత్నిస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు. శనివారం మండలంలోని మునగవలసలో పర్యటించారు.ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి ప్రజలతో మమేకమై చేయిచేయి కలుపుదాం రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బల పరుద్దాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బొత్స రమణ, బస్వా షన్ముఖరావు, నారాయణరావు, సాయిరాందాలయ్య పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీపై వేటు పిరికిపంద చర్య

పొందూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌గాంధీపై మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలో భాగంగానే అనర్హత వేటు వేసిందని డీసీసీ ప్రధాన కార్యదర్శి పైడి నాగభూషణరావు ఒక ప్రక టనలో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రౌడీషీటర్లు, హంతకులను పెట్టుకొని వారికి లేని అనర్హత వేటు, కేవలం పరువునష్టం కేసులో శిక్షపడిందన్న నెపం తో రాహుల్‌గాంధీపై వేయడం పిరికిపంద చర్య అని తెలిపారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో నిలదీస్తున్న కారణంగానే కక్ష సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న మోదీకి, బీజేపీకి దేశప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-26T00:01:22+05:30 IST