Share News

సమస్యాత్మక గ్రామంలో ట్రైనీ డీఎస్పీ రాత్రి బస

ABN , Publish Date - Dec 28 , 2023 | 11:58 PM

సమస్యాత్మక ప్రాంతమైన పెద్దగనగళ్లవానిపేట గ్రామంలో గురువారం రాత్రి ట్రైనీ డీఎస్పీ చప్పిడి రాజా, రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌తో కలిసి పర్యటించారు.

సమస్యాత్మక గ్రామంలో ట్రైనీ డీఎస్పీ రాత్రి బస

శ్రీకాకుళం క్రైం: సమస్యాత్మక ప్రాంతమైన పెద్దగనగళ్లవానిపేట గ్రామంలో గురువారం రాత్రి ట్రైనీ డీఎస్పీ చప్పిడి రాజా, రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో ఆయన ముఖాముఖీ మాట్లాడా రు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిం చుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవా లన్నారు. గ్రామంలో వర్గాలుగా విడిపోయి కొట్లా టకు పోవద్దని సూచించారు. పార్టీల పక్షాన పోయి గ్రామాన్ని గతంలో మాదిరిగా రక్తసిక్తం చేసుకోవ దన్నారు. మత్స్యకారులంతా ఐకమత్యంతో ఎన్నికల కు వెళ్లాలని సూచించారు. 2019 ఎన్నికల్లో జిల్లా లోనే సమస్యాత్మక ప్రాంతంగా మారిన పెద్ద గన గళ్లవానిపేట గ్రామాన్ని స్ఫూర్తిదాయక గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ చట్టాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అనం తరం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రాత్రి బస చేశారు.

Updated Date - Dec 28 , 2023 | 11:58 PM