రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రీ దుర్మరణం

ABN , First Publish Date - 2023-02-06T23:57:12+05:30 IST

ఫరీద్‌పేట జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన ప్రమా దంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. అజ్జరాం గ్రామానికి చెందిన గురిడి పెంటయ్య (57) అనే తాపీమేస్త్రీ ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నగరం వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందా డు. పెంటయ్యకు భార్య అసిరితల్లి, కుమారులు గన్నిరా జు, లక్ష్మణరావు, రాజు ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన అరగంటలోపే పెంటయ్యను మృత్యువు కాటేసింది. తిరిగి వస్తానని చెప్పిన పెంటయ్య తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రీ దుర్మరణం

ఎచ్చెర్ల, ఫిబ్రవరి 6: ఫరీద్‌పేట జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన ప్రమా దంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. అజ్జరాం గ్రామానికి చెందిన గురిడి పెంటయ్య (57) అనే తాపీమేస్త్రీ ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నగరం వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందా డు. పెంటయ్యకు భార్య అసిరితల్లి, కుమారులు గన్నిరా జు, లక్ష్మణరావు, రాజు ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన అరగంటలోపే పెంటయ్యను మృత్యువు కాటేసింది. తిరిగి వస్తానని చెప్పిన పెంటయ్య తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T23:57:13+05:30 IST