విశ్వమానవ కల్యాణానికి సైకిల్ యాత్ర
ABN , First Publish Date - 2023-03-30T23:46:21+05:30 IST
విశ్వమానవ కల్యాణానికి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రామేశ్వరం నుంచి అమర్నాథ్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం నరసన్నపేట చేరుకుంది.
నరసన్నపేట, మార్చి 30: విశ్వమానవ కల్యాణానికి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రామేశ్వరం నుంచి అమర్నాథ్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర గురువారం నరసన్నపేట చేరుకుంది. జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ అమరనాథ్కు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తమిళనాడుకు చెందిన రాజు, ముత్తు తెలిపారు. ఈ ఏడాది కార్తీక మాసంలో ప్రారంభించిన ఈ యాత్ర అమరనాథ్ చేరే వర కూ కొనసాగుతుందన్నారు. దేశంలో పాడిపంటలు బాగుం డాలని, మానవ వాళికి సుఖశాంతులు కలగాలని కోరుకుం టూ ఈ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు.