ఇరువర్గాలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-07-12T00:35:29+05:30 IST

జేఆర్‌పురం స్టేషన్‌ పరిధిలోని చీకటిపేట, గురయ్యపేట గ్రామాలకు చెందిన ఇరువర్గాల వారి పై పోలీసులు కేసు నమోద చేశారు.

ఇరువర్గాలపై కేసు నమోదు

రణస్థలం: జేఆర్‌పురం స్టేషన్‌ పరిధిలోని చీకటిపేట, గురయ్యపేట గ్రామాలకు చెందిన ఇరువర్గాల వారి పై పోలీసులు కేసు నమోద చేశారు. ఆయా గ్రామాల పరిధిలో స్మశానవాటిక స్థలం కోసం గత కొన్ని రోజులుగా చీకటి కొర్లయ్య, అప్పన్న వర్గాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయని, మంగళవారం ఇరువర్గాల మధ్య తోపులాట జరిగిందని జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

డిగ్రీ విద్యార్థిని అదృశ్యంపై..

పొందూరు: డిగ్రీ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదని తండి కె.అసిరప్పడు ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటి అప్పలగ్రహారానికి చెందిన యువతి మండల కేంద్రం పొందూరులోని సిస్టం కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు సోమవారం వచ్చింది. జి.సిగడాం మండలం శ్రీరామా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. సోమవారం పరీక్షకు వచ్చి ఇంటికి రాకపోవడంతో వేచిచూసిన విద్యార్ధిని తండ్రి మంగళవారం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-07-12T00:35:29+05:30 IST