నైతిక విలువలతోనే మెరుగైన సమాజం

ABN , First Publish Date - 2023-04-18T23:54:26+05:30 IST

నైతిక విలువలు పెంపొందించడంతోనే మెరుగైన సమాజం నిర్మాణం సాధ్యమని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (బెంగళూర్‌) మాజీ వీసీ, వివేకానంద స్కూల్‌ ఆఫ్‌ లా అండ్‌ లీగల్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వెంకటరావు తెలిపారు.

నైతిక విలువలతోనే మెరుగైన సమాజం
మాజీ వీసీ వెంకటరావును సన్మానిస్తున్న బీఆర్‌ఏయూ వీసీ, అధికారులు

ఎచ్చెర్ల: నైతిక విలువలు పెంపొందించడంతోనే మెరుగైన సమాజం నిర్మాణం సాధ్యమని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (బెంగళూర్‌) మాజీ వీసీ, వివేకానంద స్కూల్‌ ఆఫ్‌ లా అండ్‌ లీగల్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.వెంకటరావు తెలిపారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని మహాత్మా జ్యోతిరావు పూలే న్యాయ కళాశాలలో మంగళవారం నైతిక విలువల ప్రాముఖ్యం అనే అంశంపై నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. న్యాయ వృత్తిలో నైతికతకు ప్రాధాన్యత ఇస్తే సమాజానికి మరింత ఉపయు క్తంగా ఉంటుందన్నారు. అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే నైతిక విలువలను అలవర్చు కోవాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ ఏ రాజేంద్ర ప్రసాద్‌, వర్సిటీ ప్రిన్సిపాల్‌ బిడ్డిక అడ్డయ్య, డీన్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ బీవీ రమణ మూర్తి, కోర్సు కోఆర్డినేటర్‌ వై..రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగామాజీ వీసీ ఆర్‌.వెం కటరావును ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-04-18T23:54:26+05:30 IST