SomuVeeraju: తారకరత్న మృతిపై సోమ వీర్రాజు దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2023-02-19T00:57:04+05:30 IST

నందమూరి తారకరత్న మృతిపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమ వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

SomuVeeraju: తారకరత్న మృతిపై సోమ వీర్రాజు దిగ్భ్రాంతి

అమరావతి: నందమూరి తారకరత్న(Nandamuri Taraka Ratna) మృతిపై బీజేపీ(bjp) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమ వీర్రాజు(SomuVeeraju) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తారకరత్న కోలుకుని ప్రజా జీవితంలోకి తిరిగి వస్తారని భావించాం.కానీ దురదృష్టవశాత్తు వారి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది.తారకరత్న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.కుటుంబ సభ్యులకు ఆభగవంతుడుమనోధైర్యాన్ని కలిగించాలని సోమ వీర్రాజు అన్నారు.

సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా తారకరత్న భౌతికకాయాన్ని శనివారం రాత్రికి హైదరాబాద్ తీసుకువచ్చి శంకర్పల్లి మండలంలోని మోకిల(mokila) గ్రామంలో తన ఇంటికి తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిలించాంబర్‌కి తీసుకువచ్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.

Updated Date - 2023-02-19T00:57:22+05:30 IST