AP HighCourt: రిషికొండపై అక్రమ తవ్వకాలపై విచారణ డిసెంబర్ 27కు వాయిదా
ABN , First Publish Date - 2023-11-29T13:53:35+05:30 IST
Andhrapradesh: రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
![AP HighCourt: రిషికొండపై అక్రమ తవ్వకాలపై విచారణ డిసెంబర్ 27కు వాయిదా](https://media.andhrajyothy.com/media/2023/20231102/rishikonda_court_616cd9a8dc.jpg)
అమరావతి: రిషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో (AP HighCourt) విచారణ వాయిదా పడింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు(బుధవారం) హైకోర్టులో విచారణకు రాగా.. డిసెంబర్ మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ పంపిన బృందం పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అక్కడ పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక నివేదికను సమర్పిస్తుందని వెల్లడించారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చేనెల 27కు వాయిదా వేసింది.