నేడు శ్రీ ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల

ABN , First Publish Date - 2023-03-30T22:30:03+05:30 IST

మండలంలోని రాజంపల్లి సమీపాన ముసినది తీరాన శుక్రవారం శ్రీ ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల వైభవంగా జరగనుంది. ఈ తిరునాళ్ల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు శ్రీ ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల

దర్శి, మార్చి 30 : మండలంలోని రాజంపల్లి సమీపాన ముసినది తీరాన శుక్రవారం శ్రీ ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల వైభవంగా జరగనుంది. ఈ తిరునాళ్ల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శి-పొదిలి మండలాలకు మధ్యలో ఈ క్షేత్రం ఉన్నందున అనేక గ్రామాల ప్రజలు తిరునాళ్లకు తరలివ స్తారు. మహిళలు నదిలో స్నానం ఆచరించి పొంగళ్లు పొంగించి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రైతులు, పశువుల కాపరులు తమ పశుసంపదను ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేయిస్తారు. ఇక్కడ ప్రద ర్శలు చేస్తే పశువులకు ఎలాంటి జబ్బులు ఆశించివని ప్రజలకు అపార నమ్మ కం. తిరునాళ్ల సందర్భంగా స్వామి వారికి ఉదయం అభిషేకం, లక్ష్యతమ లా ర్చన తదితర విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాజంపల్లి గ్రామ స్థులు, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల తరుపున మూడు విద్యుత్తు ప్రభలను ఏర్పాటు చేస్తున్నారు. కోలాటాలు, భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2023-03-30T22:30:03+05:30 IST