పులిపాడు తాండాలో భారీ కొండచిలువ

ABN , First Publish Date - 2023-03-13T23:17:40+05:30 IST

మం డలంలోని పులిపాడుతాండా గ్రామంలో పీ హనుమానాయక్‌ వరి పొలంలో 12 అడుగుల భారీ కొండ చిలువ రెండు రోజుల నుంచి హల్‌చల్‌ చేస్తోంది. దీం తో తాండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న హనుమా నాయక్‌ పొలంలో కొం డ చిలువ ఉండడంతో రాత్రుల సమ యాల్లో గ్రామంలోకి వస్తుందని భయపడుతున్నారు.

పులిపాడు తాండాలో భారీ కొండచిలువ

భయాందోళనలో గ్రామస్థులు

ఇళ్ల సమీపంలోకి రాకుండా రాత్రంతా కాపలా

ముండ్లమూరు, మార్చి 13 : మం డలంలోని పులిపాడుతాండా గ్రామంలో పీ హనుమానాయక్‌ వరి పొలంలో 12 అడుగుల భారీ కొండ చిలువ రెండు రోజుల నుంచి హల్‌చల్‌ చేస్తోంది. దీం తో తాండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న హనుమా నాయక్‌ పొలంలో కొం డ చిలువ ఉండడంతో రాత్రుల సమ యాల్లో గ్రామంలోకి వస్తుందని భయపడుతున్నారు. సమీపంలోని ఉన్న నివాస ప్రాంతాల ప్రజలు కొండ చిలువ ఊరిలోకి రాకుండా ఉండటానికి లైట్లు వేసుకొని పొలం చుట్టూ కాపలా కాస్తున్నారు. గత రెండు రోజుల నుంచి కొండ చిలువ మధ్యాహ్న సమయంలో ఇళ్ల సమీపంలోకి వచ్చి కోళ్లు తింటోంది. సాయంత్రానికి కల్లా తాండాకు సమీపంలో ఉన్న పొలంలోకి వెళ్తోంది. రాత్రుల సమయాల్లో వీధుల్లోకి వచ్చి ఇంటి ముందు ఉన్న మూగజీవాలను సైతం కాటేస్తుందే మోనని భయాందోళనలు చెందుతున్నారు. ఫారెస్టు అధికారులు తక్షణమే స్పందించి కొండ చిలువను పట్టుకొని అడవిలో వదిలి పెట్టాలని తాండా వాసులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-13T23:17:40+05:30 IST