టీటీడీ సభ్యునిగా శిద్దా సుధీర్‌

ABN , First Publish Date - 2023-08-26T01:03:34+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా యువ పారిశ్రామికవేత్త శిద్దా వెంకటసుధీర్‌కుమార్‌ నియమితులయ్యారు.

టీటీడీ సభ్యునిగా శిద్దా సుధీర్‌
శిద్దా సుధీర్‌కుమార్‌

ప్రభుత్వం ఉత్తర్వులు

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 25: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా యువ పారిశ్రామికవేత్త శిద్దా వెంకటసుధీర్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. సుధీర్‌ పారిశ్రామికవేత్తగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, తన తండ్రి అయిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తనయుడిగా ఉమ్మడి రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. శిద్దా రాఘవరావు ప్రస్తుతం వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన తనయుడు సుధీర్‌కుమార్‌ టీటీడీ బోర్డు సభ్యునిగా నియమితులు కావడం పట్ల జిల్లాలోని శిద్దా అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వ్యాపారరంగంతోపాటు సేవా రంగంలో ఎప్పుడూ ముందుండే సుధీర్‌కుమార్‌కు కీలక పదవి దక్కిన నేపథ్యంలో పలువురు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాత్రి నగరంలో శిద్దా నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. శిద్దా రాఘవరా వుతోపాటు ఆయన సతీమణి లక్ష్మీపద్మావతి, ఇతర కుటుంబ సభ్యులు టీటీడీలో సభ్యుడిగా నియమితులైన సుధీర్‌కుమార్‌ను అభి నందించారు.

Updated Date - 2023-08-26T01:03:34+05:30 IST