పేర్నమిట్ట ‘గడపగడప’లో రసాభాస
ABN , First Publish Date - 2023-08-02T00:17:05+05:30 IST
పేర్నమిట్టలో మంగళవారం రాత్రి జరిగిన గడపగడ పకు మన ప్రభుత్వం కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్వే టీజేఆర్.సుఽ దాకర్బాబుతో పాటు వైసీపీ నాయకుడు దుంపా చెంచిరెడ్డి, మరికొంత మంది నాయకులు పేర్నమిట్ట పర్యటనకు వెళ్ళారు.
పోలీసులు అదుపులో ఇరువురు టీడీపీ నాయకులు
ఒంగోలు (క్రైం), ఆగస్టు1: పేర్నమిట్టలో మంగళవారం రాత్రి జరిగిన గడపగడ పకు మన ప్రభుత్వం కార్యక్రమం రసాభాసగా మారింది. ఎమ్మెల్వే టీజేఆర్.సుఽ దాకర్బాబుతో పాటు వైసీపీ నాయకుడు దుంపా చెంచిరెడ్డి, మరికొంత మంది నాయకులు పేర్నమిట్ట పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఎమ్మెల్యేతో టిడ్కో గృహాల గురించి మాట్లాడేందుకు పేర్నమిట్టకు చెందిన ఈదర విష్టు, గోలి శ్రీనివాసరావు రోడ్డు పైన నిలబడి ఉన్నారు. ఎమ్మెల్వే అక్కడ కు వెళ్ళేసరికి ఆయన వెంట ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. మా కార్యక్ర మం లో మేరేంటి అంటూ వైసీపీ నాయకులు ఘర్షణ పడ్డారు. అక్కడే ఉన్న పోలీసు లు స్పందించి ఇరువర్గాలకు సర్ది చెప్పి అడ్డు తీశారు. అదే సమయంలో టీడీపీ నాయకులు విష్ణు, శ్రీనులను ఒంగోలు తాలుకా పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. అయితే టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఒంగోలులోని కలె క్టరేట్ వద్ద వైసీపీ వారితో కలిసి ఎమ్మెల్యే సుధాకర్బాబు ధర్నా చేశారు. కాగా గ డపగడపలో స్థానికులు అడ్డుకుంటే టీడీపీ వారిపై కేసులు పెట్టడమే కాకుండా తాను దళితుడినని అంటూ ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగడం గమనార్హం.