నూతన డీఈవోగా రమేష్
ABN , First Publish Date - 2023-02-11T23:51:39+05:30 IST
జిల్లా విద్యాశాఖాధికారిగా పి.రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయన్ను ఇక్కడ నియమించారు. ఇప్పటి వరకూ డీఈవోగా పనిచేసిన బి.విజయభాస్కర్ను బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆయన్ను ఆదేశించారు.
విజయభాస్కర్ బదిలీ
ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశం
ఒంగోలు (విద్య), ఫిబ్రవరి 11 : జిల్లా విద్యాశాఖాధికారిగా పి.రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయన్ను ఇక్కడ నియమించారు. ఇప్పటి వరకూ డీఈవోగా పనిచేసిన బి.విజయభాస్కర్ను బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆయన్ను ఆదేశించారు. ఇప్పటికే విద్యాశాఖలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా ఉద్యోగోన్నతి పొందిన విజయభాస్కర్ లోయర్ క్యాడర్ పోస్టు అయిన డీఈవోగా పనిచేస్తున్నారు. సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్గా, డైట్ ప్రిన్సిపాల్గా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఈవోగా విజయభాస్కర్ సమర్థవంతంగా పనిచేశారు. గత ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథములుగా నిలిచారు. విద్యాశాఖలో ప్రభుత్వ పథకాల అమలులో చురుగ్గా పనిచేశారు. నూతన డీఈవోగా నియమితులైన రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.