అందరి సహకారంతోనే సమస్యలు పరిష్కరిస్తా

ABN , First Publish Date - 2023-03-25T22:03:40+05:30 IST

రెవెన్యూ శాఖలోని ప్రతి అధికారి సహకారంతో కనిగిరి ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించి రైతులకు, ప్రజలకు అండగా ఉంటా మని ఆర్డీవో టీ అజయ్‌కుమార్‌ అన్నారు.

అందరి సహకారంతోనే సమస్యలు పరిష్కరిస్తా
ఆర్డీవోకు శుభాకాంక్షలు తెలుపుతున్న తహసీల్దార్‌, వీఆర్వోలు

ఆర్డీవో అజయ్‌కుమార్‌

కనిగిరి, మార్చి 25 : రెవెన్యూ శాఖలోని ప్రతి అధికారి సహకారంతో కనిగిరి ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించి రైతులకు, ప్రజలకు అండగా ఉంటా మని ఆర్డీవో టీ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో నూతనంగా బా ధ్యతలు చేపట్టిన ఆర్డీవోను తహసీల్దార్‌ పుల్లారావు ఆధ్వర్యంలో వీఆర్వో సంఘం నా యకులు, వీఆర్వోలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటూ రైతులకు సత్వర సేవలందించా లన్నారు. తోటి అధికారుల సహకారం లేనిదే ఏ శాఖలోనూ పనులు సజావుగా జరిగే అవకాశం లేదన్నారు. రైతులు భూ సమస్యలపై వచ్చినపుడు నీతివంతమైన సేవలం దించాలన్నారు. సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు ప్రణాళికతో రోజువారీ పనులను చక్కపెట్టుకో వాలని వీఆర్వోలకు సూచించారు. కనిగిరి ప్రాంతంలో తాను తహసీల్దార్‌గా పని చేయడంతో అవగాహన ఉందన్నారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సెక్రటరీ రాజశేఖరరెడ్డి, డివిజన్‌ సెక్రటరీ శ్రీకాంత్‌, మహదేవరెడ్డి, సునీత, సరస్వతి, నిర్మల, రాధ, షబ్బీర్‌, నాజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:03:40+05:30 IST