రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2023-02-07T00:17:45+05:30 IST

కంభం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

కంభం, ఫిబ్రవరి 6 : కంభం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. సోమవారం వైద్యశాల అభివృద్ది కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యశాలలో మందుల కొరత లేకుండా, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యశాల అభివృద్ది కమిటీ సభ్యులు సబ్బసాని సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు, జడ్‌పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్‌ జాకీర్‌, సర్పంచ్‌ బోడయ్య, సలీమ్‌, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలను కూడా సందర్శించి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధికి పలు సూచనలు చేశారు.

మురుగు కాలువల పరిశీలన

కందులాపురం పంచాయతీ పరిధిలో జరుగుతున్న మురుగు కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు. ఇటీవల గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా ఈ పనులను ప్రారంభించారు.

Updated Date - 2023-02-07T00:17:47+05:30 IST