లోకేష్ సమర్థతను నిర్ణయించేది వైసీపీ నేతలు కాదు : నూకసాని
ABN , First Publish Date - 2023-02-06T23:05:44+05:30 IST
టీడీపీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అర్హత, సమర్ధతను నిర్ణ యించేది వైసీపీ నేతలు కాదని, ప్రజలని ఒంగోలు పా ర్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొ న్నారు.
ఒంగోలు (కార్పొరేషన్), ఫిబ్రవరి 6 : టీడీపీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అర్హత, సమర్ధతను నిర్ణ యించేది వైసీపీ నేతలు కాదని, ప్రజలని ఒంగోలు పా ర్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొ న్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి లోకేష్ పాద యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర ద్వారా రాబోయే రో జుల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనరంజక పాలన అంది చబోతుందన్నారు. బీసీ నేతలను ఇబ్బంది పెట్టే ఏ రాజ కీయ నేతకైనా, ఏ రాజకీయ పార్టీకైనా స మాది తప్పద న్నారు. కొల్లు రవీంద్రను బేషరతుగా వి డుదల చేయా లని ఆయన డిమాండ్ చేశారు. బీసీ, ఎ స్సీ, ఎస్టీ మై నార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న వైసీపీకి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.